త్యాగరాజు కీర్తనలు

జగత్తులో చాల మంది భక్తి గీతాలను రచించినవారున్నారు. భగవంతుని గురిగించి కదిలించిన రచనలు చేసిన వారున్నారు. భక్త్యానంద పారవశ్యంలో తన్మయులను గావించే భక్తి గీతాలు జగత్తులో ఉన్నాయి. అయితే, త్యాగయ్య కీర్తనలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కీర్తన తన జీవితంలో ఒక సంఘటనకు సంబంధించినదే. ఉదాహరణకుతంజావూరు రాజు ధన కనక వస్తు వాహనాదులను అతని గానపటిమకు బహుమతిగా పంపినప్పుడు వానిని తిరస్కరిస్తూ"నిధి చాల సుఖమాఈశ్వర సన్నిధి చాల సుఖమా?" అనే కీర్తనను రచించి గానం చేశాడు. తన సోదరుడు రఘనాధుడు రామ విగ్రహాన్ని కావేరి నదిలో పారవేసినప్పుడు ఎంతో విలపిస్తూతీవ్ర ఆవేదనతోపరితాపంతో సంధ్యావందనం గావించు చుండగా దోసిలికి అందిన ఆ విగ్రహాన్ని చూస్తూ, "రార మా ఇంటి దాకరఘువీర సుకుమార.." అనే కీర్తనము గానం చేశాడు. రాజాస్థానంలో ఎందరో మహామభావులు.అనే కీర్తనను ఆలపించాడు. ఈ ప్రకారం ప్రతి కీర్తన ఒకానొక సంఘటనకు సంబంధించినదే. ఆ కారణంచేత ఈ కీర్తనలు భక్తిని అనుభవ జ్ఞానాన్ని శరణాగతి తత్త్వాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి.

(స.సా.వా, 99 పు.166/167)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage